18 మాసాల్లో కాంగ్రెస్ చేసింది శూన్యం

18 మాసాల్లో కాంగ్రెస్ చేసింది శూన్యం

తొర్రూరు మే 06(క్విక్ టుడే న్యూస్):- 18 మాసాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. 

మంగళవారం డివిజన్ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....
మాజీ మంత్రి దయాకర్ రావు హయాంలో పాలకుర్తి నియోజకవర్గం లోని పలు మండలాల్లో చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ యత్నించడం హాస్యాస్పదమన్నారు. తొర్రూరు లో మినీ ట్యాంక్ బండ్ పనులు దయన్న హయాంలో మంజూరు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గుచేటన్నారు. తొర్రూరు పట్టణంతోపాటు, మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ హయాంలో దయన్న చేసిన పనులు తప్ప మరేమీ కనిపించడం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా నక్కకు నాగలోకానికి ఉన్నంత ఉందన్నారు. దయన్న హయాంలో జరిగిన అభివృద్ధిపై, ప్రస్తుత ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పార్టీ అధికారంలోకి రావడానికి చెమట చిందించిన నాయకులను పక్కకు పెట్టి కొత్తగా వచ్చిన నేతలను కూర్చోబెట్టుకున్నారన్నారు. ఆ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు స్థానం లేదని ఆ పార్టీ కార్యకర్తలకే అర్థమైందన్నారు.
ప్రతిపక్షాల నాయకులను ఉన్నపలంగా చేర్చుకుంటున్నారని,  వారే కాంగ్రెస్ ను ఓడిస్తారని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాలన చేత కావట్లేదని చేతులెత్తేశాడని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
ఈ సమావేశంలో పిఎసిఎస్ డైరెక్టర్ జనార్దన్ రాజు, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్,నాయకులు ఈనెపల్లి శ్రీనివాస్, ఎస్.కె అంకుస్, మాలోత్ కాలు నాయక్, లేగల వెంకట్ రెడ్డి, మాచర్ల వెంకన్న,కుమారస్వామి, దామోదర్ రెడ్డి,గోసంగి భాస్కర్, సోమలింగం, పయ్యావుల రామ్మూర్తి, బాబు నాయక్, ఎర్రం రాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Read Also ప‌ర‌వాడ‌లో ఇళ్ల నిర్మాణాల‌కు.. అనుమ‌తులు అక్క‌ర్లేదా..? 

IMG-20250506-WA0044

Read Also ఘ‌నంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ జన్మదిన వేడుక‌లు.. ప్ర‌త్యేక పూజలు నిర్వ‌హించిన 79 వ వార్డు కార్పొరేట‌ర్‌ రౌత్ శ్రీనివాస్

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?